దుర్మార్గపు కేసీఆర్ పాలనపై పోరాటానికి మద్దతు పలికేందుకు

తెలంగాణలో కుటుంబపాలనను అంతమొందించాలని ప్రజలు నిశ్చయించుకున్నారు.

దొర పాలనను ఎందుకు అంతమొందించాలి?

దొర పాలనను ఎందుకు అంతమొందించాలి?

తెలంగాణలో బట్టబయలైన దొర మోసపూరిత విధానాలు

2014 నుండి దొర పాలనలో, అవినీతి పెచ్చుమీరిపోయింది. కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఉద్యమకారులను అణిచేసి ఉద్యమద్రోహులు అందలమెక్కారు. నీళ్లు నిధులు నియామకాల ఉద్యమ నినాదం పక్కదారి పట్టింది.
దొర అసమర్థ విధానాల వల్ల ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్ప అయింది. అన్నదాతల ఆర్తనాదాలు అరణ్య రోదనలే అయ్యాయి. యువత భవిత ఛిద్రమైంది. పాఠశాలల్లో కనీస వసతులు లేక భావి తెలంగాణ పౌరుల జీవితాలు ఆగమైతున్నాయి. దొర అరాచక రాచరిక పాలన నుండి తెలంగాణను కాపాడుకోవలసిన సమయం ఆసన్నమయింది.
తెలంగాణను ఇన్నేళ్ళుగా వంచిస్తున్న దొర అవినీతి పాలనపై ప్రజలను చైతన్యపరిచేందుకే ‘సాలు దొర సెలవు దొర’ ఉద్యమం. అబద్ధపు హామీల పునాదుల మీద బంగారు తెలంగాణ నిర్మిస్తామన్న దొర మోసపూరిత పోకడలను ఎండగట్టడానికి, దొర పాలనలో జరిగిన అన్యాయాల మీద గళమెత్తడానికి కలిసి రండి. ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి. దొరను గద్దె దించే పోరాటంలో మీరూ భాగస్వాములు కండి.

తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడాలి

  • తెలంగాణ ఉద్యమ అమరవీరుల త్యాగాలను అవమానించాడు.
    అమరవీరుల సంక్షేమం కోసం బూటకపు వాగ్దానాలు చేయడమే కాకుండా ఉద్యమద్రోహులను తన పార్టీలో చేర్చుకున్నాడు. చివరకు దొరను ప్రశ్నించిన నాయకులను పార్టీ నుంచే వెళ్ళగొట్టాడు.
  • యువత ఆకాంక్షలను ఆవిరి చేశాడు
    యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడమే కాకుండా, TSPSC పరీక్షాపత్రాల లీకులతో యువత కలలను, ఆశలను చిదిమేశాడు. జాబ్ క్యాలెండర్ల పేరుతో ఏళ్ళ తరబడి నిరుద్యోగుల్ని నిరీక్షించేలా చేశాడు.
  • సర్పంచులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న దుర్మార్గ పాలన
    దొర పాలనలో అభివృద్ధి అనేది కేవలం కలగానే మిగిలింది. నిధులు లేక, సకాలంలో బిల్లులు రాక అనేకమంది సర్పంచులు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..
    ● 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు.
  • ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టాడు.
    వనరుల వినియోగం చేతగాక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. రాష్ట్రం ఏర్పడిన తరుణంలో రూ.75,577 కోట్లుగా ఉన్న అప్పు, ఇప్పుడు సుమారు రూ.4.33 లక్షల కోట్లకు చేర్చి దారుణమైన పాలనను సాగిస్తున్నాడు.
    ● రాష్ట్రం అప్పులు ₹4.33 లక్షల కోట్లు
  • దళితులను దగా చేశాడు
    ఓట్ల కోసం దళితుల్ని నయ వంచన చేశాడు దొర. దళితులను సీఎం చేస్తానని, 3 ఎకరాల భూమి ఇస్తానని, దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇస్తానన్న హామీలతో మోసం చేసి దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారాన్ని అనుభవిస్తున్నాడు.
  • దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో మూడవ స్థానం
    కేసీఆర్ పాలనలో 2014 నుంచి 2021 వరకు తెలంగాణలో 5,943 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది దేశంలో 3వ అత్యధికం. తెలంగాణలో ప్రతిరోజూ కనీసం ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ, కిసాన్ సర్కార్ పేరుతో అసత్య ప్రచారం చేసుకుంటున్నడు.
    ● 5,943 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
  • రుణమాఫీ అబద్ధం
    తెలంగాణలో రైతు రుణమాఫీ హామీ నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యాడు. 92% వ్యవసాయ కుటుంబాలు ఇప్పటికీ అప్పుల్లో ఉన్నా, తగు చర్యలు తీసుకోడు కేసీఆర్.
    ●ప్రతి వ్యవసాయ కుటుంబంపై ₹1.5 లక్షల అప్పు

సాలు దొర సెలవు దొర నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళదాం

సాలు దొర సెలవు దొర నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళదాం

దొర అరాచక పాలనకు సెలవు పలికేందుకు షేర్ చేయండి

COPY

ప్రత్యేక గీతం

వార్తల్లో దొర ఆగడాలు

ప్రజానాడి

  • అక్రమాలకు రాచబాట పరిచేలా కబ్జాలను చట్టబద్దం చేసేలా ధరణి పోర్టల్ తెచ్చి సమస్యని పదింతలు చేసి పీడిస్తున్నారు కేసీఆర్.

    - కేశవ్ కుమార్,చెన్నూర్

  • కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కహానీలు ఎన్ని చెప్పి ఆఖరికి ఒక్క ఎకరం కూడా తడపలేని అసమర్ధ ముఖ్యమంత్రి కేసీఆర్

    - సావిత్రమ్మ,పెద్దపల్లి

  • కిసాన్ సర్కార్ తెస్తానని గొప్పలు చెప్పుకునే సదరు దేశ్ కీ నేతకు తన తొమ్మిదేళ్ల పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న 8 వేల మంది రైతుల గోస మాత్రం వినపడలేదు

    - సమ్మయ్య,జోగులాంబ గద్వాల

  • ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి పట్టించిన దివాలాకోరు రాజకీయం కేసీఆర్ కే సాధ్యం

    - కిరణ్ కుమార్,హైదరాబాద్

  • ఏరోజైతే నా బిడ్డలు పరదాలు కట్టుకొని పాయఖానాకి పోయే దయనీయ స్థితి వచ్చిందో ఆరోజే నిర్ణయించుకున్నాను,జీవితంలో ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఓటు వేయకూడదు అని

    - రాజమ్మ,స్టేషన్ ఘనపూర్

  • ఇంటింటికీ ఉద్యోగమని చెప్పి ఒక్క ఇంటికే ఉద్యోగాలన్నీ పంచుకున్న దుర్బుద్ది ఈ కేసీఆర్ ది

    - శేఖర్ కుమార్,అశోకనగర్

  • ఉద్యమంలో ముందుండి కొట్లాడిన మా ఆర్టీసీ కార్మికుల నెత్తురు కళ్ల చూసిన రోజే కేసీఆర్ పతనం మొదలైంది,ఇక మిగిలింది లాంఛనమే

    - వెంకటేశం,మాజీ ఆర్టీసీ ఉద్యోగి

  • మా దళితుల్ని ఎన్ని రకాలుగా మోసం చేయవచ్చో అన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్. ఇలాంటి నయవంచకుడ్ని నా 70 ఎల్ల జీవితంలో ఎక్కడా చూడలేదు

    -శంకర్ సుద్దాల